Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జిత సేవల పునరుద్ధరణ - టిక్కెట్ల ధరలు పెంపు : తితిదే నిర్ణయం

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (16:47 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బోర్డు గురువారం సమావేశమైంది. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా, కరోనా వైరస్ కారణంగా నిలిపివేసిన అర్జిత సేవలను తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయిస్తూనే, ఈ టిక్కెట్ల ధరలను పెంచాలని కీలక నిర్ణయం తీసుకుంది. 
 
సుప్రభాత సేవకు రూ.2 వేలు, తోమాల, అర్చన సేవా టిక్కెట్ ధర రూ.5 వేలు, వేద ఆశీర్వచనానికి రూ.10 వేలు, కళ్యాణోత్సవానికి రూ.2500, వస్త్రాలంకరణ సేవా టిక్కెట్ ధరను రూ.లక్షకు పెంచాలని తితిదే నిర్ణయం తీసుకుంది. 
 
మరోవైపు, 2022-23 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌కు కూడా ఆమోదం తెలిపింది. మొత్తం రూ.3,096 కోట్ల అంచనాతో ఈ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. రూ.230 కోట్ల వ్యయంతో పద్మావతి చిన్నపిల్లల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని తితిదే బోర్డు నిర్ణయించింది. 
 
స్విమ్స్ ఆస్పత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని తీర్మానించింది. ముఖ్యంగా ఆస్పత్రిలో కంప్యూటరీకరణ కోసం రూ.2.7 కోట్లను కేటాయించింది. అలాగే, ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు వీలుగా రూ.25 కోట్లను కేటాయించింది. అదేవిధంగా తిరుమలలో సాగుతున్న అన్నదానాన్ని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఉచితంగా అందించాలని నిర్ణయించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments