Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపట్ల జిల్లా కొరిశపాడులో విమానాల ల్యాండిగ్.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
సోమవారం, 18 మార్చి 2024 (19:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద జాతీయ రహదారి 16పై విమానాలు ల్యాండింగ్ అయ్యాయి. ఏదేని విపత్తులు సంభవించినపుడు, యుద్ధ సమయాల్లో అత్యవసర రవాణా కోసం దేశంలో కొన్నిచోట్ల జాతీయ రహదారులపై రన్‌వేలు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఏపీలోని బాపట్ల జిల్లా కొరిశపాడు, ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద జాతీయ రహదారి 16పై అత్యవసర ల్యాండింగ్ కోసం రన్‌వేలు నిర్మించారు. 
 
వీటిపై నేడు అధికారులు కొరిశపాడు వద్ద జాతీయ రహదారిపై ఫ్లైట్ ల్యాండింగ్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్‌లో సుఖోయ్ 30, హాక్ యుద్ధ విమానాలు, ఏఎన్ 32 రవాణా విమానం, రెండు హెలికాఫ్టర్ పాల్గొన్నాయి. వాయుసేన విమానాలు రన్‌వేపై ఐదు మీటర్ల ఎత్తు వరకు వచ్చి మళ్లీ గాల్లోకి లేచాయి. ఇలా పలుమార్లు విన్యాసాలు చేపట్టారు. 
 
యుద్ధ విమానాలు రొదతో పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. ఎపుడూ చూడని యుద్ధ విమానాలు తమ ప్రాంతాల్లో చక్కర్లు కొట్టడం పట్ల కొరిశపాడు, సమీప గ్రామాల ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments