Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపట్ల జిల్లా కొరిశపాడులో విమానాల ల్యాండిగ్.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
సోమవారం, 18 మార్చి 2024 (19:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద జాతీయ రహదారి 16పై విమానాలు ల్యాండింగ్ అయ్యాయి. ఏదేని విపత్తులు సంభవించినపుడు, యుద్ధ సమయాల్లో అత్యవసర రవాణా కోసం దేశంలో కొన్నిచోట్ల జాతీయ రహదారులపై రన్‌వేలు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, ఏపీలోని బాపట్ల జిల్లా కొరిశపాడు, ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద జాతీయ రహదారి 16పై అత్యవసర ల్యాండింగ్ కోసం రన్‌వేలు నిర్మించారు. 
 
వీటిపై నేడు అధికారులు కొరిశపాడు వద్ద జాతీయ రహదారిపై ఫ్లైట్ ల్యాండింగ్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్‌లో సుఖోయ్ 30, హాక్ యుద్ధ విమానాలు, ఏఎన్ 32 రవాణా విమానం, రెండు హెలికాఫ్టర్ పాల్గొన్నాయి. వాయుసేన విమానాలు రన్‌వేపై ఐదు మీటర్ల ఎత్తు వరకు వచ్చి మళ్లీ గాల్లోకి లేచాయి. ఇలా పలుమార్లు విన్యాసాలు చేపట్టారు. 
 
యుద్ధ విమానాలు రొదతో పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. ఎపుడూ చూడని యుద్ధ విమానాలు తమ ప్రాంతాల్లో చక్కర్లు కొట్టడం పట్ల కొరిశపాడు, సమీప గ్రామాల ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments