Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో దిగజారిపోయిన సీఎం జగన్ పాలన : సినీ నటుడు పృథ్వీరాజ్

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (09:54 IST)
ఏపీలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పాలన పూర్తిగా దిగజారిపోయి అధ్వాన్నంగా తయారైందని జనసేన పార్టీ నేత, సినీ నటుడు పృథ్వీరాజ్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. తన స్వీయ దర్శకత్వంలో రూపొందించిన 'కొత్త రంగుల ప్రపంచం' సినిమా బృందం బోనకల్లును ఆదివారం సందర్శించింది. 
 
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలు ఖచ్చితంగా బుద్ది చెప్పడం ఖాయమన్నారు. ఏపీలో 2024లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో జనసేన తన ప్రభంజనం సృష్టించబోతుందన్నారు. 
 
'బ్రో' సినిమాలో శ్యాంబాబు పాత్ర గురించి ప్రశ్నించగా దర్శకుడు చెప్పిన పాత్రలో నటించాను తప్ప వేరే వాళ్ల గురించి తెలియదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు బానోతు కొండ, గోంగూర శ్రీనివాసరావు పాల్గొన్నారు.
 
ఇదిలావుంటే, పృథ్వీరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన 'కొత్త రంగుల ప్రపంచం' సినిమా బృందం బోనకల్లులో ఆదివారం సందడి చేసింది. టీవీ ఆర్టిస్ట్‌ బానోత్‌ శ్రీనివాసరావు ఇంటికి అతిథులుగా వచ్చి విలేకరులతో మాట్లాడారు. కథానాయికగా తన కుమార్తె శ్రీ, హీరోగా తన మిత్రుడి కుమారుడు క్రాంతి నటించారని, చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి ఆనందించాలని కోరారు. హీరో కాంతి, కథానాయిక శ్రీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

భైరవం టీజర్ ఈవెంట్ లో ఆడిపాడిన అతిధి శంకర్ - పక్కా హిట్ అంటున్న హీరోలు

హత్య ట్రైలర్ రిలీజ్ కాగానే డిస్ట్రిబ్యూటర్లే సినిమాను అడిగారు : దర్శకురాలు శ్రీవిద్యా బసవ

Vijay Ranga Raju: యజ్ఞం విలన్ నటుడు విజయ రంగరాజు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

తర్వాతి కథనం
Show comments