Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేహ్ జిల్లాలో ప్రమాదం.. తెలంగాణ జవాన్ మృతి

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (09:39 IST)
జమ్మాకాశ్మీర్ రాష్ట్రంలోని లద్దాఖ్‌లోని లేహ్ జిల్లాలో శనివారం సైనికులు ప్రయాణిస్తున్న వాహనం ఒకటి అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతుల్లో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తిర్మన్ దేవులపల్లికి చెందిన జవాను చంద్రశేఖర్ (30) కూడా ఉన్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. 
 
ఈ గ్రామానికి చెందిన మల్లయ్య, శివమ్మ దంపతుల ముగ్గురు సంతానంలో చిన్నవాడైన చంద్రశేఖర్‌ కొందుర్గులోని బీసీ సంక్షేమ వసతిగృహంలో పదోతరగతి వరకు చదివారు. తదనంతరం ఆయన 2011లో సైన్యంలో చేరారు. విధి నిర్వహణలో భాగంగా శనివారం లేహ్‌ జిల్లాలో తోటి సైనికులతో కలిసి ప్రయాణిస్తుండగా వాహనం లోయలో పడింది. 
 
ఈ దుర్ఘటనలో చంద్రశేఖర్‌ ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూడు నెలల క్రితం గ్రామానికి వచ్చిన ఆయన కుమారుడిని బడిలో చేర్పించేందుకు మళ్లీ వస్తానని చెప్పి వెళ్లారంటూ ఆయన భార్య లాస్య కన్నీటి పర్యంతమయ్యారు. జవాన్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పార్థివదేహం సోమవారం గ్రామానికి చేరుకోవచ్చని మాజీ సర్పంచి రామకృష్ణ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments