Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌కు అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్

prithviraj
, బుధవారం, 10 మే 2023 (09:10 IST)
ప్రముఖ కమెడియన్, థర్టీ ఇయర్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన నటుడు పృథ్విరాజ్‌ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటంతో ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రికి  తరలించి సెలైన్ ఎౕక్కించారు. అయితే, ఆస్పత్రిలో ఎందుకు చేరారన్న విషయంపై క్లారిటీ లేదు. 
 
పృథ్విరాజ్‌ను ఒక్కసారిగా ఆస్పత్రి బెడ్‌పై చూడగానే ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. కంగారుపడిపోయారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఆస్పత్రి పడకపై నుంచే పృథ్వీరాజ్ ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
 
"దర్శకుడిగా తొలిసారి ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాను. కొత్త రంగుల ప్రపంచం అనే మూవీకి మీ ఆదరణ కావాలి.ఈ నెల 26వ తేదీన పెద్ద ఈవెంట్ చేయబోతున్నాం. సెలైన్‌తో ఉన్నా సినిమా గురించే ఆలోచిస్తున్నాం. మా కొత్త రంగుల ప్రపంచం సినిమాకు, మా బృందానికి మీ సపోర్టు ఉండాలి" అని ఆ వీడియోలో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నార్త్ లో శ్రీనివాస్ కు వస్తున్న ఆదరణ చూసి తండ్రిగా గర్వపడుతున్నా: బెల్లంకొండ సురేష్