Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాంకర్ ఝాన్సీ శాపనార్థాలు... ఎందుకో తెలుసా?

jhansi
, సోమవారం, 8 మే 2023 (17:36 IST)
తెలుగు బుల్లితెరపై ప్రముఖ యాంకర్‌గా గుర్తింపు పొందిన ఝాన్సీ శాపనార్థాలు పెట్టారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తరహా వ్యాఖ్యలు చేశారు. తనను అనేక మంది మోసం చేశారని ఆరోపించారు. తన వద్ద లక్షలాది రూపాయలు డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారని చెప్పారు. తనకు ఇచ్చిన చెక్కుల్లో మూడు నెలల ముందు తేదీలు వేసి ఇచ్చిన మోసం చేశారని చెప్పారు. పైగా, తనతో సన్నిహితంగా ఉంటూనే, తాను క్రియేట్ చేసిన కాన్సెప్టులు ఒకే కానివ్వకుండా చేసిన వారు కూడా ఉన్నారని చెప్పారు. ఇలా మోసం చేసిన వారిని.. ఎందుకు ఇలా చేశారని తాను ఇప్పటివరకు అడలేదన్నారు. 
 
తనకు అన్యాయం చేసినవారికి నా శాపం చాలా గట్టిగా తగులుతుందన్నారు. అది నాకు తెలుసు. నా శాపం ఎంతగా తగులుతుందనేది నాతో రెండు రోజులు కేరక్టర్ చేయించుకుని పీకేసిన వారికి బాగా తెలుసు. ఒక పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్, రెండు రోజుల కేరక్టర్ చేశాను. నా డబ్బులు నాకు ఇచ్చారు. కానీ, ఆ తర్వాత ఆ పాత్ర కోసం వేరే ఆర్టిస్ట్‌ను తీసుకున్నారు. నిజంగా అది నాకు అవమానమే. దాంతో నా శాపం గట్టిగా తగిలింది. మళ్లీ ఇంతవరకు కోలుకోలేదు అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీలకంఠ కొత్త సినిమా పేరు సర్కిల్