Tirupati Zoo Park: పాముకి ఆహారం వేస్తూ దాని కాటుకే బలైన మహిళ

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (16:10 IST)
తిరుపతి జూ పార్కులో జంతు సంరక్షురాలిగా విధులు నిర్వహిస్తున్న విజయమ్మ అనే మహిళ పాము కాటుకు బలైంది. పాములకు ఆహారం వేస్తున్న క్రమంలో ఓ పాము ఆమెని కాటు వేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
 
వివరాలలోకి వెళితే.. తిరుపతి జూ పార్కులో గత కొన్నేళ్లుగా విజయమ్మ జంతు సంరక్షుకురాలిగా పనిచేస్తోంది. ఉదయాన్నే జూ పార్కులో వున్న పక్షులు, పాములు ఇతర చిరు జంతువులకు ఆహారం వేస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె సోమవారం నాడు పాములకు ఆహారం వేసేందుకు వెళ్లింది. ఆహారం వేస్తున్న సమయంలో ఓ పాము ఆమెను కాటు వేసింది.
 
దీనితో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులుగా చికిత్స తీసుకుంటూ వున్న విజయమ్మ గురువారం నాడు కన్నుమూసింది. దీనితో విషాదం నెలకొంది. జూ పార్కులో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ఐతే ఆమెను పాము ఎలా కాటు వేసిందన్నది విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments