Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tirupati Zoo Park: పాముకి ఆహారం వేస్తూ దాని కాటుకే బలైన మహిళ

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (16:10 IST)
తిరుపతి జూ పార్కులో జంతు సంరక్షురాలిగా విధులు నిర్వహిస్తున్న విజయమ్మ అనే మహిళ పాము కాటుకు బలైంది. పాములకు ఆహారం వేస్తున్న క్రమంలో ఓ పాము ఆమెని కాటు వేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
 
వివరాలలోకి వెళితే.. తిరుపతి జూ పార్కులో గత కొన్నేళ్లుగా విజయమ్మ జంతు సంరక్షుకురాలిగా పనిచేస్తోంది. ఉదయాన్నే జూ పార్కులో వున్న పక్షులు, పాములు ఇతర చిరు జంతువులకు ఆహారం వేస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె సోమవారం నాడు పాములకు ఆహారం వేసేందుకు వెళ్లింది. ఆహారం వేస్తున్న సమయంలో ఓ పాము ఆమెను కాటు వేసింది.
 
దీనితో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులుగా చికిత్స తీసుకుంటూ వున్న విజయమ్మ గురువారం నాడు కన్నుమూసింది. దీనితో విషాదం నెలకొంది. జూ పార్కులో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ఐతే ఆమెను పాము ఎలా కాటు వేసిందన్నది విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments