Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళనాడులో ఖా'కీచక' పర్వం : ఐపీఎస్ మహిళా అధికారికి వేధింపులు

తమిళనాడులో ఖా'కీచక' పర్వం : ఐపీఎస్ మహిళా అధికారికి వేధింపులు
, గురువారం, 25 ఫిబ్రవరి 2021 (08:38 IST)
దేశంలోనే శాంతి భద్రతల పరిరక్షణలో మొదటిస్థానంలో ఉండే తమిళనాడు రాష్ట్రంలో ఓ ఐపీఎస్ స్థాయి లేడీ ఆఫీసరుకు లైంగిక వేధింపులు తప్పలేదు. డీజీపీ స్థాయి ఐపీఎస్ అధికారి ఆమెను లైంగికవాంఛ తీర్చాలంటూ వేధించాడు. ఇదే విషయాన్ని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. దీంతో విచారణకు ఓ కమిటీని రాష్ట్ర హోంశాఖ ఏర్పాటు చేసింది. ఆమె ఆరోపణలపై సదరు ఉన్నతాధికారి మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.
 
ఇదిలావుంటే, ప్రధాని మోడీ చెన్నై పర్యటన సమయంలో ఆ అధికారిని దూరం పెట్టారు. రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తుండగా, ఆ బాధ్యతల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని దూరం పెట్టినట్టు అధికారులు తెలిపారు.
 
మరోవైపు, ఈ ఘటనపై ప్రతిపక్ష డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసుల అహంకారానికి ఇది నిదర్శనమని, ఇలాంటి పోలీసు అధికారులు ఉన్నందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు. ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసిన మహిళా అధికారిని మెచ్చుకుంటున్నట్టు స్టాలిన్ పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మార్చి 4న భారత ఉప రాష్ట్రపతి తిరుపతి పర్యటన