Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మార్చి 4న భారత ఉప రాష్ట్రపతి తిరుపతి పర్యటన

మార్చి 4న భారత ఉప రాష్ట్రపతి తిరుపతి పర్యటన
, గురువారం, 25 ఫిబ్రవరి 2021 (08:31 IST)
మార్చి 4 న గౌ. భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తిరుపతి, తిరుమల పర్యటన నిమిత్తం జిల్లా కు రానున్నారని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ తెలిపారు.

భారత ఉప రాష్ట్రపతి మార్చి 4 న తిరుపతి, తిరుమల పర్యటనలో భాగంగా చెన్నై నుండి వాయుసేన ప్రత్యేక విమానం ద్వారా బయల్దేరి ఉ. 9.50 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారని, అనంతరం ఉ. 10.15 గం. లకు తిరుపతి లోని ఐఐటి కళాశాల చేరుకుని అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని, తర్వాత ఉ. 11.20 గం. లకు తిరుపతి లోని అమర ఆసుపత్రి ప్రారంభోత్సవం చేస్తారు.

అనంతరం మ. 12.15గం. లకు తిరుమల బయల్దేరి మ.1.15 గం. లకు తిరుమల పద్మావతి అతిథి గృహం చేరుకుని, రాత్రి బస చేస్తారని తెలిపారు.

5వ తేదీ ఉదయం 5.30గం. లకు శ్రీవారిని దర్శించుకుని ఉ.8.30 గం.లకు తిరుమల నుండి బయల్దేరి ఉ. 9.20గం. లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ఉ. 9.25 గం. లకు వాయుసేన ప్రత్యేక విమానంలో సూరత్ బయల్దేరి వెళతారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం పెరగాలి: కృష్ణా కలెక్టర్‌