Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌ లో 24 గంటల్లో 8,635 కరోనా కేసులు

భారత్‌ లో 24 గంటల్లో 8,635 కరోనా కేసులు
, మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:44 IST)
భారత్‌ లో కరోనా మరణాలు 100 దిగువకు చేరాయి. అలాగే రోజువారీ కేసుల 10వేలలోపునకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో 94 మరణాల సంభవించగా.. 8,635 కొత్త కేసులు వెలుగుచూశాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.

దాంతో ఇప్పటి వరకు 1,07,66,245 మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 1,54,486కి చేరింది. ఎనిమిది నెలల తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదకావడం ఇదే తొలిసారి.
 
మరోవైపు రికవరీ రేటు 97శాతానికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 13,423 మంది కరోనా నుంచి కోలుకోగా.. కోటీ నాలుగు లక్షల మందికి పైగా వైరస్‌ను జయించారు. ఎప్పటిలాగే క్రియాశీల కేసుల్లో క్షీణత కొనసాగింది.

దేశంలో 1,63,353 క్రియాశీల కేసులుండగా..ఆ రేటు 1.56 శాతానికి తగ్గింది. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం.. నిన్న వైద్య సిబ్బంది 6,59,422 మంది నమూనాలను పరీక్షించారు.  

మరోవైపు, జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 1 వరకు 39,50,156 మందికి టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

నిన్న 1,91,313 మంది టీకా వేయించుకున్నారు. కొవిషీల్డ్, కొవాగ్జిన్‌ టీకాలను కేంద్రం అత్యవసర వినియోగం కింద వైరస్ ముప్పు పొంచి ఉన్నవారికి అందిస్తోన్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్పొరేట్లకు అప్పగించడమే దేశభక్తా? సీఎం మమతా బెనర్జీ