Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంచలన నిర్ణయం తీసుకున్న భారత్ - పాకిస్థాన్ సైన్య బలగాలు

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (16:00 IST)
భారత్, పాకిస్థాన్ దేశాలకు చెందిన సైనిక బలగాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి ఇక నుంచి కాల్పులు జరుపుకోకూడదని పరస్పర అంగీకారానికి వచ్చాయి. ఈ మధ్య నియంత్రణ రేఖ వెంబడి తరుచూ కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. 
 
'ఇరు దేశాలు పరస్పరం ప్రయోజనం పొందడానికి, స్థిరమైన శాంతిని సాధించాలన్న ఆసక్తితో ఈ నిర్ణయం తీసుకున్నాం. హింసకు దారితీసే పరిస్థితుల వల్ల తరుచూ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. దీంతో డీజీఎస్‌ఎంవో స్థాయిలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు' అని ఇరు దేశాల అధికారులు తెలిపారు. 
 
ఈ పరస్పర అంగీకారం ద్వారా నియంత్రణ రేఖ వెంబడి హింస తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర అంగీకారం కుదిరినా సరే, నియంత్రణ రేఖ వెంబడి మాత్రం భారత్ బలగాలను మోహరించే ఉంచింది. అక్రమ చొరబాట్లను నియంత్రించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరపకూడదని ఇరు దేశాలు 2003లో ఒప్పందాలు చేసుకున్నాయి. అయినా... తరుచూ ఈ ఒప్పందానికి పాక్ తూట్లు పొడుస్తూనే ఉన్న విషయం తెల్సిందే. 
 
ఏదేమైనప్పటికీ.. తాజా ఒప్పందం వల్ల పాకిస్థాన్‌లో కొంచమైనా మార్పు వస్తుందని భావిస్తున్నట్టు ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక అధికారి తెలిపారు. పాక్‌లో మార్పు వస్తే సరిహద్దుల్లో శాంతి నెలకొంటుందని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments