Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఆ పేరు మార్చేశారు : తెరపైకి మరో వివాదం

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (10:19 IST)
వైకాపా ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో రూ.684 కోట్లతో నిర్మిస్తున్న గరుడ వారధి పేరు శ్రీనివాస సేతుగా మారుస్తున్నట్లుగా నగర పాలక సంస్థ కౌన్సిల్ నిర్ణయించింది. అయితే, గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైన ఈ వారధి పేరును ఇప్పుడు మార్చడం వివాదాస్పదమైంది. 
 
కానీ, అధికారికంగా ఎలాంటి పేరు లేదని స్థానిక ఎమ్మెల్యే, నగర పాలక సంస్థ కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితుడు కరుణాకర్‌రెడ్డి చెప్పడం గమనార్హం. స్వామి వారికి గరుడు అత్యంత ప్రీతిపాత్రుడని, కాబట్టి ఆ పేరుతో ఉన్న సేతుపై నుంచి రాకపోకలు సాగించడం భావ్యం కాదనే వారధి పేరును శ్రీనివాస సేతుగా మార్చుతున్నట్టు వివరించారు. 
 
అయితే, ఆయన వ్యాఖ్యలను మరికొందరు తప్పుబడుతున్నారు. గరుడి పేరుతో ఉన్న వారధిపై నడవడం తప్పు అయినప్పుడు స్వామి పేరుతో ఉన్న వంతెనపై నుంచి నడవడం ఒప్పెలా అవుతుందో కరుణాకర్ రెడ్డి వివరించాలని కోరారు. మరోవైపు ఈ వారధి పేరు మార్పును వ్యతిరేకిస్తూ తెదేపా కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ సమావేశాన్ని బహిష్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments