దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
బుధవారం, 18 ఆగస్టు 2021 (10:09 IST)
దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం లెక్కల ప్రకారం 25 వేలకు దిగిరాగా.. తాజాగా 35 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 35,178 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. 
 
కొత్తగా 37,169 మంది బాధితులు కోలుకున్నారని తెలిపింది. మరో 440 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.14శాతం ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 3,67,415 యాక్టివ్‌ కేసులున్నాయని, 148 రోజుల తర్వాత కనిష్టానికి చేరుకున్నాయని చెప్పింది.
 
ప్రస్తుతం రికవరీ రేటు 97.52 శాతానికి చేరుకుందని తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,22,85,857కు చేరాయి. ఇందులో మొత్తం 3,14,85,923 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి ఇప్పటి వరకు 4,32,519కు మంది ప్రాణాలు కోల్పోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hrithik Roshan: ప్రాజెక్ట్ హెయిల్ మేరీ చిత్రాన్ని ప్రమోషన్ చేస్తున్న హృతిక్ రోషన్

Manchu Vishnu: వంద దేవుళ్లు ఫస్ట్ లుక్ ఆవిష్కరించి విషెస్ తెలిపిన విష్ణు మంచు

Sandeep Kishan: యుద్ధాలు ముగియవు, రాజులు మరణించరు అనే కాన్సెప్ట్ తో సందీప్ కిషన్‌ చిత్రం

Sridevi: మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించిన బ్యాండ్ మేళం ట్రైలర్

సూర్య నుండి స్ఫూర్తి పొందిన మెగాస్టార్ చిరంజీవి... పవన్ కల్యాణ్ ప్రశంసలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్‌సీఐ అధ్యయనం

ఖాళీ కడుపుతో లవంగాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాలంటే తేనెతో ఈ పదార్థాలు తింటే చాలు

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలి, ప్రయోజనాలు ఏమిటి?

పిల్లలు కనమంటే నో చెప్తున్న రష్యా మహిళలు.. వ్లాదిమిర్ పుతిన్‌కు తలనొప్పి

తర్వాతి కథనం
Show comments