Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం భూదందాలో ముగ్గురు "నీలి మీడియా" విలేఖరుల అరెస్టు

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (11:18 IST)
అనంతపురం జిల్లాలో భూదందా కేసు ఒకటి వెలుగు చూసింది. ఈ కేసులో ముగ్గురు నీలి మీడియా విలేఖరులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 14.96 ఎకరాల భూమిని ఈ ముగ్గురు విలేఖరులు మరికొంతమందితో కుమ్మక్కై గుట్టుచప్పుడు కాకుండా విక్రయించారు. 
 
ఈ మొత్తం భూమి విక్రయ లావాదేవీల్లో రూ.14 కోట్లకు డీల్ కుదుర్చుకోగా ఇందులో రూ.75 లక్షల మేరకు చేతులు మారినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ముగ్గురు విలేఖరులతో పాటు ఓ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. వీరందరినీ కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది. 
 
ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియాల వేదికగా వరుస ట్వీట్లు చేసింది. 
 
"జగన్ రెడ్డి అబద్దాలను ప్రచార చేయడానికి సాక్షితో పాటు, టివి9 ఎన్టీవీలు ఒక్కటై వైసీపీ ప్రభుత్వ అనుకూల బులుగు మీడియాగా అవతరించిన విషయం అందరికీ తెలిసిందే. 
 
అయితే ఈ కలయిక అసత్య ప్రచారానికే పరిమితం కాలేదు. ఇప్పుడది అవినీతి బాగోతాలకు ఎదిగింది. దానికి నిదర్శనమే ఈ భూ అక్రమం. 
 
అనంతపురంలో నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి 14.96 ఎకరాల భూమిని మరొకరికి విక్రయించి రిజిస్ట్రేషన్ కూడా చేయించేశారు. 
 
ఈ కేసు విషయమై పోలీసులు విచారణ చేస్తే టీవీ-9 విలేఖరి లక్ష్మికాంత్ రెడ్డి, అతని డ్రైవర్, స్థానిక ఎన్టీవీ, సాక్షి విలేఖర్లే సూత్రధారులు అన్నవిషయం తేలింది. 
 
ఈ అక్రమ వ్యవహారం నడిపేందుకు రూ.14 కోట్లకు డీల్ కుదుర్చుకోగా, ఇప్పటికే రూ.75 లక్షలు చేతులు మారింది. 
 
సీసీ ఫుటేజ్, నగదు లావాదేవీలకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించిన పోలీసులు విలేకరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అని వరుస ట్వీట్లలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments