Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిష దృష్టంతా కెరీర్‌పైనే.. రాజకీయాల్లోకి రారు : తల్లి ఉమ

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (10:51 IST)
సినీ నటి త్రిష రాజకీయాల్లోకి రానున్నారని, ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. వీటిని త్రిష స్వయంగా తోసిపుచ్చారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. పైగా, ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో అర్థం కావడం లేదన్నారు. ఇపుడు ఈ వార్తలపై త్రిష తల్లి ఉమ కూడా స్పందించారు. 
 
తన కుమార్తె పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. అవన్నీ ఊహాగానాలే అని, వాటిని నమ్మొద్దని అన్నారు. తన కుమార్తె త్రిషకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనగానీ, సమయంగానీ లేదన్నారు. ఇలాంటి పుకార్లు ఎవరు పుట్టిస్తారో తెలియని పేర్కొంటూ అసహనం వ్యక్తం చేశారు. 
 
పైగా ప్రస్తుతం సినీ కెరీర్‌పైనే దృష్టి పెట్టిందని ఆమె వివరించారు. తాను నటించే అన్ని భాషల్లో మంచి పేరు తెచ్చుకోవాలన్నదే ఆమె ఆశయం అని తెలిపారు. త్రిష ప్రస్తుతం మణిరత్న దర్శకత్వంలో తెరకెక్కిన "పొన్నియన్ సెల్వన్" అనే చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments