Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాపట్ల నేరాలు ఘోరాలు.. ట్రాక్టర్ బోల్తా.. వైకాపా కార్యకర్త చైన్ స్నాచింగ్ (video)

వరుణ్
ఆదివారం, 28 జులై 2024 (18:15 IST)
Bapatla
బాపట్లలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల కర్లపాలెం మండలం యాజలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందగా ఎనిమిది మందికి గాయాలయ్యాయి. 
 
శిగమట మండలం గట్టువారి పాలెం గ్రామానికి చెందిన కొండపాటూరు చెట్లు కోసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. యాజలి జెడ్పీ హైస్కూల్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించే క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో గట్టు కోటేశ్వరరావు (65), గడ్డం శివనాగులు (60), గడ్డం లక్ష్మి (40) అక్కడికక్కడే మృతి చెందారు. 
 
క్షతగాత్రులను 108 వాహనం ద్వారా బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రికి తక్షణ వైద్యం నిమిత్తం తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
మరోవైపు చైన్ స్నాచింగ్ కేసులో వైకాపా కార్యకర్తే బాపట్లలో బయటపడ్డారు. బాపట్లలో వైసిపి కార్యకర్త విజయ్ చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న దృశ్యం మీడియాలో వైరల్ అవుతోంది. వైకాపా కార్యకర్తగా వుండి రోడ్డుపై నిల్చున్న మహిళ వద్ద ఏదో మాట్లాడుతూ.. ఆమె చైన్‌ను లాక్కెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments