Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మూతపడిన బాపట్ల బీచ్‌.. కారణం ఏంటంటే?

Beach

సెల్వి

, మంగళవారం, 25 జూన్ 2024 (10:58 IST)
Beach
రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలోని రెండు బీచ్‌లను స్థానిక పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. గతవారంలో ఆరుగురు బాపట్ల బీచ్‌లో స్నానానికై వచ్చి మునిగిపోయారు. దీంతో ప్రజలను సముద్రంలోకి ప్రవేశించకుండా నిషేధించారు. 
 
బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ గత వారం రోజుల్లో ఆరుగురు వ్యక్తులు నీటిలో మునిగి చనిపోయారని, దీంతో సూర్యలంక, వాడ్రేవు బీచ్‌లలో నీళ్లలోకి ప్రవేశించకుండా పోలీసులు నిషేధం విధించారని తెలిపారు. 
 
గత వారంలో, మేము 14 మందిని రక్షించాం. అయితే ఆరుగురు వ్యక్తులు సముద్రంలో మునిగిపోయారు. ఈ ఏడాది బీచ్ చాలా ప్రమాదకరంగా ఉంటుందని జిందాల్ చెప్పారు. కొంతమంది మోకాళ్ల లోతు వరకు మాత్రమే వెళ్లినప్పటికీ, వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటం వల్ల ప్రాణాంతకంగా మారుతున్నట్లు ఎస్పీ గమనించారు. ఈ ఏడాది సముద్రం మరింత ఉధృతంగా ఉందని, కొంతమంది బీచ్‌లకు వెళ్లేవారిని రక్షించవచ్చని... అయితే పోలీసులు అన్ని చోట్లా ఎల్లవేళలా ఉండలేరని జిందాల్ చెప్పారు. 
 
76 కి.మీ పొడవైన తీరప్రాంతంతో, బాపట్ల బీచ్‌లు రాష్ట్రంలో, వెలుపల నుండి అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తాయి. వారాంతాల్లో దాదాపు 15,000 మంది సందర్శకులు వస్తారని జిందాల్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెరుగుతున్న టమాటా, ఉల్లి ధరలను అదుపు చేయాలి..