Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఆర్డీయే బిల్లు కమిటీ ఛైర్మన్‌గా బొత్స - వికేంద్రీకరణ కమిటీ బిల్లు పెద్దగా మంత్రి బుగ్గన

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (15:00 IST)
పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులు సెలెక్ట్ కమిటీకి పంపుతూ ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు బిల్లులకు వేర్వేరుగా రెండు కమిటీలను మండలి ఛైర్మన్ ఏర్పాటు చేశారు. వీటిలో సీఆర్డీయే బిల్లు రద్దు కమిటీ ఛైర్మన్‌గా మంత్రి బొత్సన సత్యనారాయణను నియమించారు. అలాగే, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు కమిటీ పెద్దగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని నియమిస్తూ మండలి ఛైర్మన్ ఆదేశాలు జారీచేశారు. 
 
కాగా, సీఆర్డీఏ రద్దు బిల్లు సెలెక్ట్ కమిటీలో సభ్యులుగా తెలుగుదేశం పార్టీ నుంచి దీపక్ రెడ్డి, బచ్చుల అర్జునుడు, రవిచంద్ర, శ్రీనివాసులు, వైసీపీ నుంచి మహ్మద్ ఇక్బాల్, బీజేపీ నుంచి సోము వీర్రాజు, పీడీఎఫ్ నుంచి వెంకటేశ్వరరావు ఉంటారు. 
 
అలాగే, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించిన సెలెక్ట్ కమిటీ ఛైర్మన్‌గా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సభ్యులుగా తెదేపా నుంచి నారా లోకేశ్, తిప్పేస్వామి, అశోక్ బాబు, సంధ్యారాణి, బీజేపీ నుంచి మాధవ్, వేణుగోపాల్ రెడ్డి, పీడీఎఫ్ నుంచి లక్ష్మణరావు ఉన్నారు.
 
వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించిన సెలెక్ట్ కమిటీ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని తాము భాగస్వామ్యం కాబోమంటూ మండలి ఛైర్మన్ షరీఫ్‌కు  వైసీపీ నేతలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఉమ్మారెడ్డి లేఖ రాసిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments