Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమజ్జనంలో విషాదం.. విగ్రహంతో పాటు ఇద్దరు గల్లంతు.. ఒకరు మృతి

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (14:20 IST)
ఏపీలోని కాకినాడ జిల్లాలోని యు.కొత్తపల్లి మండలి నాగులాపల్లి గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని సముద్రంలో కలిపే సమయంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ గ్రామానికి చెందిన యువకులంతా కలిసి వినియకచవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇష్టదైవానికి నవరాత్రుల పేరిట వివిధ రకాలైన పూజలు చేశారు. ఆ తర్వాత విగ్రహ నిమజ్జన వేడుకల్లో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. తమ గ్రామంలోని విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేయాలని భావించారు. 
 
విగ్రహాన్ని ఊరేగించుకుంటూ వెళ్లి ఉప్పాడ సమీపంలోని హార్బర్ వద్ద నిమజ్జనం చేశారు. అయితే, ఆ సమంయలో అలల తీవ్ర ఎక్కువగా ఉండటంతో సముద్రంలో నిమజ్జనం చేసిన విగ్రహం ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. దీన్ని గమనించిన కొందరు యువకులు మన విగ్రహం ఒడ్డుకు కొట్టుకొస్తుందని చెప్పారు. వెంటనే వారంతా వెనక్కి వెళ్లి విగ్రహాన్ని సముద్రంలోకి నెట్టేందుకు ప్రయత్నించారు. 
 
ఇంతలో ఓ రాక్షస అలకు విగ్రహంతో ముగ్గురు యువకులు సముద్రంలోకి వెళ్లిపోయారు. వీరి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ఆచూకీ మాత్రం తెలియడం లేదు. గల్లంతైన యువకులను సతీష్, విజయ్ వర్ధన్‌లుగా గుర్తించారు. వెంకట రెడ్డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, గల్లైంతైన వారి కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments