కృష్ణంరాజు పార్థివదేహంపై బీజేపీ జెండా.. నివాళులు అర్పించిన నేతలు

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (12:56 IST)
సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అనారోగ్యం కారణంగా ఆదివారం వేకువజామున మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. అయితే, ఆయన ఒక సినీ నటుడుగానే కాకుండా రాజకీయ నేతగా ఉన్నారు. గతంలో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వంలో వివిధ శాఖలకు సహాయ మంత్రిగా పని చేశారు. ఈయన బీజేపీ నేత కూడా. దీంతో ఆయన పార్థివదేహంపై బీజేపీ పతాకాన్ని కప్పారు. 
 
ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు కలిసి జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు నివాసానికి వెళ్ళి తమ నేత భౌతిక కాయంపై బీజేపీ జెండా ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు కృష్ణంరాజు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను విష్ణువర్థన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 
 
కాగా, కృష్ణంరాజు 1998లో కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు. ఆ మరుసటి ఏడాదే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరసాపురం నుంచి బరిలో దిగి మరోసారి ఎంపీగా ఘనవిజయం అందుకున్నారు. రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచిన ఆయనను అప్పటి బీజేపీ హైకమాండ్ కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకుని కేంద్ర సహాయ మంత్రిగా నియమించింది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments