Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణంరాజు పార్థివదేహంపై బీజేపీ జెండా.. నివాళులు అర్పించిన నేతలు

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (12:56 IST)
సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అనారోగ్యం కారణంగా ఆదివారం వేకువజామున మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు సోమవారం జరుగనున్నాయి. అయితే, ఆయన ఒక సినీ నటుడుగానే కాకుండా రాజకీయ నేతగా ఉన్నారు. గతంలో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రభుత్వంలో వివిధ శాఖలకు సహాయ మంత్రిగా పని చేశారు. ఈయన బీజేపీ నేత కూడా. దీంతో ఆయన పార్థివదేహంపై బీజేపీ పతాకాన్ని కప్పారు. 
 
ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు కలిసి జూబ్లీహిల్స్‌లోని కృష్ణంరాజు నివాసానికి వెళ్ళి తమ నేత భౌతిక కాయంపై బీజేపీ జెండా ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు కృష్ణంరాజు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను విష్ణువర్థన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 
 
కాగా, కృష్ణంరాజు 1998లో కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు. ఆ మరుసటి ఏడాదే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరసాపురం నుంచి బరిలో దిగి మరోసారి ఎంపీగా ఘనవిజయం అందుకున్నారు. రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచిన ఆయనను అప్పటి బీజేపీ హైకమాండ్ కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకుని కేంద్ర సహాయ మంత్రిగా నియమించింది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments