Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతపురం కియా కంపెనీలో దొంగలుపడ్డారు.. 900 కారు ఇంజిన్లు చోరీ!!

ఠాగూర్
మంగళవారం, 8 ఏప్రియల్ 2025 (14:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో కియా కార్ల తయారీ కంపెనీ ఉంది. ఇందులో దొంగలుపడ్డారు. ఈ దొంగలు ఏకంగా 900 ఇంజన్లు చోరీచేసినట్టు సమాచారం. ఇదే అంశంపై కంపెనీ యాజమాన్యం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా కంపెనీలో తయారయ్యే కార్లకు అవసరమైన విడిభాగాలు వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తాయి. ఇంజన్లు తమిళనాడు నుంచి వస్తాయి. ఇవి మార్గమధ్యంలో చోరీకి గురయ్యాయా లేక కంపెనీలోనే దొంగతనం చేశారా అనే అంశంపై స్పష్టత రావాల్సివుంది. 
 
ఈ చోరీకి  సంబంధించిన గత నెల 19వ తేదీన కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. తొలుత లిఖితపూర్వక ఫిర్యాదు లేకుండా విచారణ జరిపించాలని కోరగా, పోలీసులు అందకు సమ్మతించలేదు. లిఖితపూర్వకంగా ఇస్తేనే విచారణ చేపడుతామని స్పష్టం చేయడంతో ఇక చేసేది లేక వారు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో కియా కార్ల తయారీ కంపెనీలో చోరీకి గురైన ఇంజన్లు ఎక్కడున్నాయన్న అంశాన్న నిగ్గు తేల్చేందుకు పోలీసులు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసింది. దర్యాప్తు కూడా పూర్తికాగా, పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించిన తర్వాతే  పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments