Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కు స్పందన కరవు

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (10:02 IST)
విశాఖ జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ మందకొడిగా సాగుతోంది. జిల్లాలో గత నెల 16వ తేదీన వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. ఈ నెల రోజుల్లో ముందుగా స్లాట్లు తీసుకున్న వారిలో 37,684 మంది (40.30 శాతం) మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

మరో 55,667 మంది వ్యాక్సిన్‌ తీసుకోవడానికి ముందుకురాలేదు. అత్యధికంగా 21,597 మంది ఆరోగ్య సిబ్బంది (60.77 శాతం) వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 39.23 శాతం మంది వ్యాక్సిన్‌కు దూరంగా ఉన్నారు. వీరిలో మూడొంతుల మంది ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లకు చెందినవారిగా అధికారులు చెబుతున్నారు.

మొదటి దశలో ఆరోగ్య సిబ్బందికి పూర్తయిన తరువాత ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు. ప్రస్తుతం మిగిలిన ఆరోగ్య సిబ్బందితోపాటు రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మునిసిపల్‌, కేంద్ర బలగాలకు వ్యాక్సిన్‌ ఇస్తున్నారు.

అయితే ఈ శాఖలకు చెందిన సిబ్బంది నుంచి నామమాత్రంగానే స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా మునిసిపల్‌ శాఖలో అత్యల్పంగా 11.64 శాతం మంది మాత్రమే ఇప్పటివరకు వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ శాఖకు చెందిన 24,263 మంది సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు స్లాట్‌ బుక్‌ చేయగా, 2,826 మంది మాత్రమే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments