Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 9 నుంచి మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (09:51 IST)
దక్షిణ భారత దేశంలో పేరెన్నికగన్న మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించారు. నంద్యాల సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి అధ్యక్షతన సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కామేశ్వరీ సహిత మహానందీశ్వర స్వామివార్లకు మార్చి 9 నుంచి 14వ తేదీ వరకూ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.

ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులకు సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి పలు సూచనలు చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు సమన్వయంతో పని చేయాలని ఆమె ఆదేశించారు. మార్చి 9వ తేదీన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురారోపణ చేస్తారు. 10వ తేదీన విశేష హోమాలు, వాహన సేవలు నిర్వహిస్తారు.

11వ తేదీన రాత్రి 10 గంటల నుంచి లింగోద్భవ కాల మహారుద్రాభిషేకం, తెల్లవారు జామున 3 గంటలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. 12వ తేదీ ఉదయం నిత్య పూజలు, దీక్షా హోమాలు, 13న యాగశాల పూజలు, రథోత్సవం నిర్వహిస్తారు. 14వ తేదీన పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments