Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కు అమ్మకానికి మరో అడుగు : న్యాయ సలహాకు నోటిఫికేషన్

Webdunia
గురువారం, 8 జులై 2021 (11:42 IST)
విశాఖపట్టణం స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. కన్సల్టెంట్‌ నియామకానికి కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌తో పాటు అనుబంధ సంస్థలన్నీ వందశాతం అమ్ముతామని ప్రకటనలో కేంద్రం పేర్కొంది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గయ్యపేట, తెలంగాణలోని మాదారం స్టీల్‌ ప్లాంట్ మైన్స్‌ను కూడా అమ్మకానికి కేంద్రం పెట్టింది. బిడ్‌లో పాల్గొనేందుకు లక్ష రూపాయల డిపాజిట్, కోటి రూపాయల బ్యాంక్‌ గ్యారంటీ చూపాలని నోటిఫికేషన్‌లో కేంద్రం పేర్కొంది. 
 
ఈ విషయం తెలుసుకున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. విశాఖ ఉక్కును అమ్మాలని చూస్తే చూస్తూ ఊరుకోబమని హెచ్చరించారు. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రకటించారు. ఉక్కు ఫ్యాక్టరీలోకి అడుగుపెడితే తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments