Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మామిడి కాయల దుకాణం పెట్టిన హీరో నరేష్

మామిడి కాయల దుకాణం పెట్టిన హీరో నరేష్
, బుధవారం, 23 జూన్ 2021 (15:04 IST)
అనేక మంది సినీ సెలెబ్రిటీలకు వ్యక్తిగతంగా పామ్‌హౌస్‌లు ఉన్నాయి. ఇక్కడ పండే పండ్లను తమ స్నేహితులు, బంధు మిత్రులకు పంపుతుంటారు. అలాంటి ఫాంహౌస్‌ను కలిగిన వారిలో సినీ నటుడు నరేష్ కూడా ఉన్నారు. 
 
తన ఫాంహౌస్ తోటలో పండించిన పండ్లను స్వయంగా అమ్మారు. లాక్డౌన్ సమయంలో వ్యవసాయంతో కాస్తంత టైంపాస్ చేసిన అతడు.. ఇప్పుడు ఫాంహౌస్‌లో తన చెట్లకు కాసిన పండ్లను తానే స్వయంగా కోశారు.  
 
ఆ మామిడి పండులు, నేరేడు పండ్లను ఆఫీసుకు తీసుకొచ్చి స్వయంగా విక్రయించారు. కిలో రూ.50 చొప్పున మొత్తం రూ.3,600 సంపాదించాడు. తన పండ్ల వ్యాపారం గురించి ఆయన ట్విట్టర్‌లో స్పందించారు.
 
సినీ నటుడిగా అత్యధిక పారితోషికం తీసుకున్నప్పుడు కలిగిన ఆనందం కన్నా.. ఇప్పుడు స్వయంగా వ్యవసాయం చేసి సంపాదించిన దాంతోనే ఎక్కువ ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. వ్యవసాయం చేయడంలోనే అసలైన మజా ఉందన్నారు. 
 
సేంద్రియ పద్ధతిలో తన ఫాంహౌస్‌లో పండించిన మామిడి, నేరేడు పండ్లను తానే స్వయంగా కోశాననీ, కిలో రూ.50కి అమ్మానని నరేశ్ చెప్పారు. ట్విట్టర్‌లో ఆయన పెట్టిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అలీతో కలిసి ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ అనే సినిమాలో ఆయన నటిస్తున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హేమ రాక‌తో వేడెక్కిన `మా` ఎన్నిక‌లు