Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెబెల్ అలీ పోర్టులో భారీ పేలుడు.. ఉలిక్కిపడిన నగరం

Webdunia
గురువారం, 8 జులై 2021 (11:34 IST)
ప్రపంచంలోనే అతి పెద్ద నౌకాశ్రయంగా పేరుగాంచిన జెబెల్ అలీ పోర్టులో భారీ పేలుడు సంభవించింది. భారత ఉపఖండంతో పాటు, ఆఫ్రికా, ఆసియాకు ఇక్కడి నుంచి సరుకుల రవాణా జరుగుతుంది. అలాంటి పోర్టులో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఆ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోర్టులోని ఓ కంటెయినర్ షిప్‌కు ఆ మంటలు అంటుకుని, ఈ భారీ పేలుడు సంభవించింది. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ విస్ఫోటనం జరిగింది. 
 
ఈ ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.
 
పేలుడు శబ్దం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టామని, బయటకు వచ్చి చూస్తే ఆకాశమంతా ఎరుపు రంగులోకి మారిపోయి ఉందని చెప్పుకొచ్చారు. ఈ ఘటన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments