Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంకు పెట్టెలో కరెన్సీ నోట్లు.. ఐదు లక్షలు చెదల పాలు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (12:59 IST)
ఏపీకి చెందిన ఓ వ్యాపారవేత్త బ్యాంకు కంటే తన ఇంట్లోని ట్రంకు పెట్టే సేఫ్ అనుకున్నాడు. తాను కష్టపడి సంపాదించిన సొమ్మును ఆ పెట్టెలో పెట్టాడు. కట్టల కొద్దీ డబ్బు. రూ.500, 200, 100 నోట్ల కట్టలు. కానీ ఆ డబ్బు కాస్తా చివరికి చెదల పాలైంది. 
 
ఏకంగా రూ.5 లక్షల్ని చెదలు తినేశాయి. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని మైలవరంలో ఉన్న బిజిలీ జమాలయ్య ఇంట్లో చోటుచేసుకుంది. పందుల వ్యాపారం చేసే అతడు.. నగదు రూపంలోనే వ్యాపారం చేస్తాడు. ఇందులో వచ్చే డబ్బు మొత్తాన్నీ బ్యాంకులో వేసే బదులు ఇంట్లోని ట్రంకు పెట్టెలోనే పెట్టేవాడు. 
 
బాగా డబ్బు జమ చేసి ఇల్లు కట్టుకోవాలన్నది జమాలయ్య కల. దీనికోసం ఇప్పటికే రూ.5 లక్షలు జమ చేశాడు. తాను చెమటోడ్చి సంపాదించిన డబ్బంతా చెదల పాలవడం చూసి తెగ బాధపడిన అతడు.. ఆ మిగిలిన కరెన్సీ ముక్కలను చుట్టుపక్కల ఉండే పిల్లలకు పంచి పెట్టడం విశేషం. పిల్లల చేతుల్లో పెద్ద పెద్ద నోట్లు కనిపించే సరికి పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ఈ ఘటన వెలుగు చూసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

తర్వాతి కథనం
Show comments