Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిహార్: పదకొండేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ప్రిన్సిపల్‌కు మరణ శిక్ష - ప్రెస్ రివ్యూ

Webdunia
బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (12:58 IST)
బిహార్‌లో ఓ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, ఆమె గర్భవతి కావడానికి కారకుడైన ప్రిన్సిపల్‌కు పట్నాలోని పోక్సో కోర్టు మరణశిక్షతోపాటు రూ.లక్ష జరిమానా విధించినట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది. ఈ అత్యాచారం ఘటనలో ప్రిన్సిపల్‌కు సహకరించిన టీచర్‌కు జీవిత ఖైదు, రూ.50వేల జరిమానా విధించినట్లు ఈ కథనం పేర్కొంది.

 
స్కూల్‌ గంట కొట్టిన తర్వాత ఇంటికి వెళుతున్న చిన్నారిని ప్రిన్సిపల్‌ అరవింద్‌ కుమార్‌ తన గదికి పిలిపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న టీచర్‌ అభిషేక్‌ అరవింద్‌కు సహకరించాడు.

 
కొన్నాళ్ల తర్వాత కడుపులో నొప్పి అంటూ చిన్నారి బాధపడుతుండటంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో చిన్నారి గర్భవతి అని తేలింది. బాలిక చెప్పిన వివరాల ప్రకారం తల్లిదండ్రులు ప్రిన్సిపల్‌ మీదా, అతనికి సహకరించిన టీచర్‌ మీదా ఫిర్యాదు చేశారు.

 
ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదికల్లో నేరం నిరూపణ కావడంతో పొక్సో చట్టం కింద శిక్ష విధించారు. 2018లో నమోదైన ఈ కేసును ఓ అరుదైన కేసుగా పోక్సో కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నట్లు ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం