Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిడుగు రామమూర్తి జయంతి : త్వరలో తెలుగు విశ్వవిద్యాలయం

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (10:31 IST)
గిడుగు రామమూర్తి జయంతి వేడుకలను తెలుగు భాషా దినోత్సవంగా తెలుగు రాష్ట్రాలు జరుపుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ విద్యా శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
 
గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఏఎన్‌యూలో 13 మంది భాషా పండితులకు ఆయన గిడుగు రామమూర్తి పురస్కారాలను అందజేశారు. అనంతరం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తపాలాశాఖ రూపొందించిన ప్రత్యేక కవర్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్ ఆవిష్కరించారు.
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏపీలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినా తెలుగును ఖచ్చితంగా బోధించాలని స్పష్టం చేశారు. 
 
తెలుగుకు సంబంధించిన ప్రత్యేక కోర్సులు, డిగ్రీలను తీసుకురానున్నట్టు వెల్లడించారు. తెలుగు గొప్పతనాన్ని ఖండాంతరాలకు వ్యాప్తి చేసేందుకు తాము ఎన్‌ఆర్ఐల సహకారం తీసుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

'సిరివెన్నెల'కు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments