Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేయ్... నా.. కొ.. కా... మరదలిని పెళ్లి చేసుకున్న భర్తకు భార్య బడిత పూజ

Webdunia
శనివారం, 20 ఏప్రియల్ 2019 (09:27 IST)
తొలి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్న భర్తకు ఓ భార్య బడిత పూజ చేసింది. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కలిసి ఆ ప్రబుద్ధుడిని ఉతికి ఆరేశారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరానికి చెందిన సాంబశివరావుకు నాలుగేళ్ల క్రితం శైలజ అనే మహిళతో వివాహమైంది. ఆమెకు పిల్లలు పుట్టలేదు. దీంతో ఆమెను మానసికంగా వేధించసాగాడు. ఈ వేధింపులు భరించలేని శైలజ.. భర్తను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లింది .
 
ఇదే అదునుగా భావించిన సాంబశివరావు భార్యకు తెలియకుండా మరదలి వరుస అయ్యే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న శైలజ ఆగ్రహంతో రగిలిపోయింది. తన బంధువులతో కలిసి భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగేవరకూ అక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది.
 
అంతేనా, విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్న భర్త పట్టుకుని ఉతికి ఆరేసింది. రెండో భార్యతో ఏకాంతంగా భర్త ఉన్నపుడు ఇంటిపై దాడి చేసి ఆయన్ను పట్టుకుంది. ఆ తర్వాత భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులంతా కలిసి పట్టుకుని చావబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సాంబశివరావును రక్షించి, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments