Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరాయి స్త్రీతో భర్త వివాహేతర లింకు.. భార్య సూసైడ్...

కట్టుకున్న భర్త తనను నిర్లక్ష్యం చేసి పరాయి స్త్రీతో పలుకుతుండటాన్ని జీర్ణించుకోలేని ఓ వివాహిత వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ దారుణం ఖమ్మం జిల్లా తల్లాడలో జరిగింది.

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (09:36 IST)
కట్టుకున్న భర్త తనను నిర్లక్ష్యం చేసి పరాయి స్త్రీతో పలుకుతుండటాన్ని జీర్ణించుకోలేని ఓ వివాహిత వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ దారుణం ఖమ్మం జిల్లా తల్లాడలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన అనగాని రంజిత్‌కుమార్‌తో రజిని (27) అనే మహిళకు 11 యేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. 
 
అయితే, గత కొంతకాలంగా మరో మహిళతో తన భర్త రంజిత్ కుమార్ వివాహేతర సంబంధం నడుపుతున్న విషయాన్ని రజిని కనిపెట్టింది. దీంతో భర్త వైపు నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. రంజిత్‌ కుమార్‌కు అతని తల్లి నాగమణి సహకరించడంతో ఈ వేధింపులను రజినీ తట్టుకోలేక పోయింది. 
 
ఈ క్రమంలో ఇటీవల రజిని గొల్లగూడెంలోని పుట్టింటికి వెళ్లింది. మూడో తేదీన ఆత్మహత్యకు ప్రయత్నించింది. తీవ్రంగా గాయపడిన రజినిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ మృతి చెందింది. 
 
రజిని తండ్రి గుండ్ల చిన నరసింహ ఫిర్యాదు మేరకు తల్లాడ ఎస్సై బి.తిరుపతిరెడ్డి కేసు నమోదు చేసి, శవపరీక్ష నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని నారాయణపురం తీసుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments