Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరాయి స్త్రీతో భర్త వివాహేతర లింకు.. భార్య సూసైడ్...

కట్టుకున్న భర్త తనను నిర్లక్ష్యం చేసి పరాయి స్త్రీతో పలుకుతుండటాన్ని జీర్ణించుకోలేని ఓ వివాహిత వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ దారుణం ఖమ్మం జిల్లా తల్లాడలో జరిగింది.

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (09:36 IST)
కట్టుకున్న భర్త తనను నిర్లక్ష్యం చేసి పరాయి స్త్రీతో పలుకుతుండటాన్ని జీర్ణించుకోలేని ఓ వివాహిత వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ దారుణం ఖమ్మం జిల్లా తల్లాడలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన అనగాని రంజిత్‌కుమార్‌తో రజిని (27) అనే మహిళకు 11 యేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. 
 
అయితే, గత కొంతకాలంగా మరో మహిళతో తన భర్త రంజిత్ కుమార్ వివాహేతర సంబంధం నడుపుతున్న విషయాన్ని రజిని కనిపెట్టింది. దీంతో భర్త వైపు నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. రంజిత్‌ కుమార్‌కు అతని తల్లి నాగమణి సహకరించడంతో ఈ వేధింపులను రజినీ తట్టుకోలేక పోయింది. 
 
ఈ క్రమంలో ఇటీవల రజిని గొల్లగూడెంలోని పుట్టింటికి వెళ్లింది. మూడో తేదీన ఆత్మహత్యకు ప్రయత్నించింది. తీవ్రంగా గాయపడిన రజినిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ మృతి చెందింది. 
 
రజిని తండ్రి గుండ్ల చిన నరసింహ ఫిర్యాదు మేరకు తల్లాడ ఎస్సై బి.తిరుపతిరెడ్డి కేసు నమోదు చేసి, శవపరీక్ష నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని నారాయణపురం తీసుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: రామ్ చరణ్ సమున్నత స్థాయిలో నిలవాలి : పవన్ కళ్యాణ్

Peddi: రామ్ చరణ్, జాన్వీ కపూర్ చిత్రం పెద్ది టైటిల్ ప్రకటన

Movie Ticket Hike: పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ టిక్కెట్ రేట్ల సంగతేంటి?

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో 'ఆర్‌సి 16'

ఐశ్వర్య కారును ఢీకొన్న బస్సు.. తప్పిన పెను ప్రమాదం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

తర్వాతి కథనం
Show comments