Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళతో సహజీవనం.. కడదాకా కలిసుంటానని.. కడతేర్చాడు...

మహిళతో సహజీవనం.. కడదాకా కలిసుంటానని.. కడతేర్చాడు...
, సోమవారం, 8 అక్టోబరు 2018 (09:28 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళకు కడవరకు కలిసివుటానని నమ్మించి సహజీవనం చేశాడు. ఆ తర్వాత మధ్యలోనే కడతేర్చాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన గుంజా రాధాకృష్ణ కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. మద్యానికి బానిసై భార్యను, పిల్లలను వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి పాల్వంచ మండలం మందెరికలపాడు గ్రామానికి చెందిన సాంబలక్ష్మి(28)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత ఆమెను నమ్మించి కడవరకు కలిసివుంటానని చెప్పి సహజీవనం చేస్తూ వచ్చాడు. 
 
అయితే, ఇటీవల తరచూ వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. శుక్రవారం అర్థరాత్రి ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో సాంబలక్ష్మిని బలంగా కొట్టడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతిచెందింది. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న రాధాకృష్ణ కోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళా డాక్టర్‌ను చంపేసిన గాలిపటం దారం... ఎలా?