Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళతో సహజీవనం.. కడదాకా కలిసుంటానని.. కడతేర్చాడు...

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (09:28 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళకు కడవరకు కలిసివుటానని నమ్మించి సహజీవనం చేశాడు. ఆ తర్వాత మధ్యలోనే కడతేర్చాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం గ్రామానికి చెందిన గుంజా రాధాకృష్ణ కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. మద్యానికి బానిసై భార్యను, పిల్లలను వదిలేసి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి పాల్వంచ మండలం మందెరికలపాడు గ్రామానికి చెందిన సాంబలక్ష్మి(28)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత ఆమెను నమ్మించి కడవరకు కలిసివుంటానని చెప్పి సహజీవనం చేస్తూ వచ్చాడు. 
 
అయితే, ఇటీవల తరచూ వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. శుక్రవారం అర్థరాత్రి ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో సాంబలక్ష్మిని బలంగా కొట్టడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతిచెందింది. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న రాధాకృష్ణ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments