Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరీక్ష వ్రాసిన విద్యార్థినిని పొదల్లోకి తీసుకెళ్లి ఏం చేసాడంటే..?

Webdunia
గురువారం, 28 మార్చి 2019 (11:23 IST)
పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఓ ఇన్విజిలేటర్‌ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. సూర్యాపేటలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక అరవై అడుగుల రోడ్డులో గల ఒక ప్రైవేటు పాఠశాలలో మంగళవారం పదో తరగతి పరీక్ష రాసింది. సూర్యాపేట మండలంలోని ఓ తండాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు అదే ప్రైవేట్ పాఠశాలలో ఇన్విజిలేటర్‌గా విధుల్లో ఉన్నాడు. 
 
బాలిక పరీక్షలో చూసి రాసేందుకు కొంత సహకారం అందించి, ఏవేవో మాటలు చెప్పి పరీక్ష పూర్తయ్యాక కేంద్రం బయట వేచి ఉండాలని ఆమెకు సూచించాడు. బాలికను ఇంటివద్ద దింపుతానని చెప్పి తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. బాలిక అక్కడి నుంచి అతి కష్టంమీద తప్పించుకుని ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తన పెద్దమ్మకు వివరించింది.
 
బాలికకు తల్లిదండ్రులు లేకపోవడంతో పెద్దమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటోంది. బాలిక పెద్దమ్మ 100 నంబరుకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియజేసింది. పోలీసులు టీచర్‌ని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడి తరఫున రంగంలోకి దిగిన పెద్ద మనుషులు బాలిక బంధువులకు నచ్చజెప్పారు. పెద్దమనుషులు బాధితులకు కొంత నగదు ముట్టజెప్పి విషయం బయటకు పొక్కకుండా ప్రయత్నాలు చేశారని తెలిసింది. ఫిర్యాదు ఇవ్వాలని కోరినా కుటుంబసభ్యులు ఎవరూ  ముందుకు రావడం లేదని సూర్యాపేట ఇన్‌స్పెక్టర్‌ శివశంకర్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments