Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిర్మానుష్య ప్రాంతంలో శిష్యురాలిపై గురువు అత్యాచారం...

Advertiesment
School Teacher
, శుక్రవారం, 15 మార్చి 2019 (17:51 IST)
విద్య నేర్పించాల్సిన గురువే మృగంలా మారి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ వ్యక్తి నేరం రుజువు కావడంతో న్యాయస్థానం అతనికి పదేళ్ల కారాశిక్ష విధించింది. గుజరాత్‌లోని దియోదర్ ప్రాంతంలో చన్ బు భగోరా అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.
 
2017వ సంవత్సరంలో పాఠశాల ముగిసిన తర్వాత అందులో చదివే ఒక బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసాడు. ఆపై జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయంతో జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు.
 
దీనిపై విచారణ జరిపిన పోలీసులు సెక్షన్ 376 క్రింద, పోస్కో చట్టం క్రింద కేసులు పెట్టి ఆ వ్యక్తిని రిమాండుకు పంపారు. కోర్టులో నేరం రుజువు కావడంతో ఆ వ్యక్తికి 11 వేల రూపాయల జరిమానాతో పాటుగా పదేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా సమాజం తలదించుకునే పని చేసావంటూ నిందితుడిపై మండిపడ్డాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికాతో చతురు కాదు... అలా చేసి యుద్ధంలో జయించగలదు...