Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రవాహం ఉధృతంగా ఉన్నపుడు పర్యాటక పడవకు అనుమతి ఇచ్చింది ఎవరు?

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (15:22 IST)
తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంపై టీడీపీ స్పందించింది. గోదావరి ప్రవాహం ఉధృతంగా సాగుతున్నపుడు పర్యాటక పడవకు అనుమతి ఇచ్చింది ఎవరు అంటూ నిలదీసింది. ఇదే అంశంపై ఫేస్‌బుక్ ఖాతాల్ ఓ పోస్ట్ చేసింది. 
 
"నెల రోజులుగా గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. దేవీపట్నం సమీపంలో 36 గ్రామాలు దాదాపు 20 రోజులుగా జలదిగ్బంధంలో ఉన్నాయి. గోదావరిలో వరద ప్రవాహం రెండున్నర లక్షల క్యూసెక్కుల లోపు ఉంటేనే నదిలో బోటు ప్రయాణానికి అనుమతివ్వాలి. కానీ ఆదివారం వరద ఐదు లక్షల క్యూసెక్కులకుపైనే ఉంది. ఆ స్థాయి వరద నీటిలో బోట్ల రాకపోకలు చాలా ప్రమాదకరం. అయినా పర్యాటక పడవకు అనుమతి ఇచ్చింది ఎవరు? 
 
గోదావరిలో బోట్లకు అనుమతి, రద్దు బాధ్యతలను పర్యవేక్షిస్తున్న కాకినాడ పోర్టు అధికారులు ఏం చేస్తున్నారు? పోర్టు అధికారులకు ఎప్పటికప్పుడు వరద ఉధృతిపై సమాచారమిచ్చి హెచ్చరికలు చేయాల్సిన రాష్ట్ర నీటిపారుదల శాఖ ఏం చేస్తోంది? అలాగే పాపికొండలుకు బోట్లు బయల్దేరే ముందు దేవీపట్నం నుంచి పోలీసులు వచ్చి తనిఖీ చేసి పంపాలి. ఆదివారం ఆ తనిఖీలు జరిగాయా లేదా? జరిగితే బోటు ఎలా బయలుదేరింది? 
 
అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు ప్రజలు. వైసీపీ ప్రభుత్వం ప్రతి అవినీతినీ చూసీ చూడనట్టుగా వదిలేయడంవల్లే ఈరోజు పదుల సంఖ్యలో కుటుంబాలు తమ ఆప్తులను పోగొట్టుకోవాల్సి వచ్చింది అంటూ తెదేపా ఆ ట్వీట్‌లో పేర్కొంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments