Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో తెదేపాకు షాక్ : గోడదూకనున్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (13:52 IST)
తెలుగుదేశం పార్టీకి విశాఖపట్టణం జిల్లాలో గట్టి షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధికార వైకాపాలో చేరనున్నారు. ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. 
 
విశాఖపట్టణాన్ని రాజధానిగా టీడీపీ వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ కొన్ని నెలల క్రితమే తెలుగుదేశానికి ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
కాగా, ఇదే జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కూడా వైకాపాలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నిజానికి ఈయన ఆగస్టు 16వ తేదీనే వైకాపాలో చేరాల్సివుంది. 
 
కానీ, ఆ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు.. విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్‌లు గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో గంటా అయోమయంలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైకాపాలో చేరనుండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments