Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో తెదేపాకు షాక్ : గోడదూకనున్న మాజీ ఎమ్మెల్యే పంచకర్ల

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (13:52 IST)
తెలుగుదేశం పార్టీకి విశాఖపట్టణం జిల్లాలో గట్టి షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధికార వైకాపాలో చేరనున్నారు. ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. 
 
విశాఖపట్టణాన్ని రాజధానిగా టీడీపీ వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ కొన్ని నెలల క్రితమే తెలుగుదేశానికి ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
కాగా, ఇదే జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కూడా వైకాపాలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నిజానికి ఈయన ఆగస్టు 16వ తేదీనే వైకాపాలో చేరాల్సివుంది. 
 
కానీ, ఆ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు.. విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్‌లు గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో గంటా అయోమయంలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైకాపాలో చేరనుండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments