Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాలర్‌ శేషాద్రి మృతి త‌ర‌ని లోటు... ధ‌న్య‌జీవి: చంద్రబాబు, వైవీ సుబ్బారెడ్డి

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (11:14 IST)
తిరుమల ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శేషాద్రి మృతి టీటీడీకి తీరని లోటని చెప్పారు. ఆయన నిత్యం వేంకటేశ్వరస్వామి సేవలో తరించేవారని, టీటీడీకి విశేష సేవలు అందించారన్నారు. డాలర్‌ శేషాద్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.
 
 
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం బాధాకరమని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీవారి సేవలో 1978 నుంచి తరిస్తున్న ఆయన మృతి తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. శ్రీవారి సేవే ఊపిరిగా శేషాద్రి పని చేశారని, జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్యజీవి శేషాద్రి అని సుబ్బారెడ్డి అన్నారు. అందరితో ప్రేమగా ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు పెద్ద దిక్కుగా పని చేశారని చెప్పారు. శేషాద్రి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments