Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంగారెడ్డిలో 420 కేజీల గంజాయి పట్టివేత

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (10:57 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డిలో ఆ రాష్ట్ర పోలీసులు 420 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 25 లక్షల రూపాయలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు నుంచి అక్రమంగా తరలిస్తుండగా ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఇదే అంశంపై జిల్లా ఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ, ఏపీలోని ఏలూరు నుంచి భారీ మొత్తంలో గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు తమకు సమాచారం వచ్చిందన్నారు. దీంతో జహీరాబాద్ మండలంలోని చిరాక్ పల్లి వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా, ఆ దారిలో వచ్చిన ఒక లారీని ఆపి తనిఖీ చేస్తే ఈ గంజాయి చిక్కినట్టు వెల్లడించారు.
 
మొత్తం 420 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారని, దీని విలువ రూ.25 లక్షలకు పైగా ఉంటుందని ఆయన తెలిపారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ప్రాంతానికి చెందిన అశోక్ కేసరి అనే వ్యక్తి డ్రైవరుగా పని చేస్తూ అక్రమంగా గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్టు విచారణలో వెల్లడించారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments