Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరులో కుండపోత వర్షం : జిల్లా వ్యాప్తంగా హై అలెర్ట్

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (10:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఈ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఏరులై పారుతున్నాయి. ఈ క్రమంలో ఇపుడు మరో దఫా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 
 
గూడూరు వద్ద జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా మనుబోలు - పొదలకూరుల మధ్య వాహన రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అలాగే, గూడూరు - వెంకటగిరి ప్రాంతాల మధ్య కూడా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
 
గూడూరులో కురుస్తున్న భారీ వర్షానికి ఆర్టీసీ బస్టాండులోకి పూర్తిగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో డిపోలోని బస్సులను మరో ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇక భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కండలేరు జలాశయం ప్రమాదపుటంచుల్లో ఉంది. 
 
జలాశయం కట్ట కోతకు గురవుతుంది. ఈ జలాశయం పూర్తి నీటి సామర్థ్యం 68 టీఎంసీలు కాగా, ఇప్పటికే 60 టీఎంసీల నీరు నిల్వవుంది. దీంతో లోతట్టు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments