Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రజలు అధఃపాతాళానికి తొక్కేసినా, చంద్ర‌బాబు వ‌క్ర‌బుద్ధి మారలేదు

Advertiesment
ysrcp mp vijaya sai reddy
విజ‌య‌వాడ‌ , గురువారం, 25 నవంబరు 2021 (19:21 IST)
టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన‌ చంద్రబాబు నాయుడు ప్ర‌ద‌ర్శించిన తీరు బాగోలేద‌ని ఆయ‌న అన్నారు.  
 
 
''గాల్లో కలిసిపోతారని సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు వక్రబుద్ధి ప్రజలు అధఃపాతాళానికి తొక్కేసినా మారలేదు. వరద ప్రాంతాల పర్యటనలో తన భార్య గురించి మాట్లాడి 'మనిషివా చంద్రబాబు' అనే పరిస్థితి తెచ్చుకున్నాడు. తానే బాధల్లో ఉన్నానని, వరద బాధితులే తనను ఓదార్చాలనుకుంటున్నాడు అని విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. బూతులు మాట్లాడిన వైసీపీ నేతల్ని వదిలి, తెలుగు మహిళలను వేధిస్తారా? అని విజ‌య‌సాయి విమ‌ర్శించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రిమినల్ కేసులో న్యూస్ ఛానల్ రిపోర్టర్ రాఘవేంద్ర అరెస్టు