Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

డ్రగ్స్, కల్తీ మ‌ద్యంతో జాతి నిర్వీర్యం అవుతోంది: చంద్రబాబు

Advertiesment
nara chandrababu
విజ‌య‌వాడ‌ , మంగళవారం, 19 అక్టోబరు 2021 (11:30 IST)
డ్రగ్స్, కల్తీ మ‌ద్యంతో జాతి నిర్వీర్యం అవుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ముఖ్యనేతలతో  చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంజాయి, హెరాయిన్ స్మగ్లర్లే రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని శాసిస్తున్నారని ఆరోపించారు. పాడేరు ఏజెన్సీలో లిక్విడ్ గంజాయి, ఐస్‌క్రీం, చాక్లెట్ల తయారీ చేస్తున్నారని ఆరోపించారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రెండున్నరేళ్లలో విద్యుత్ వినియోగదారులపై రూ.36,802 కోట్ల భారం పడిందని చంద్ర‌బాబు తెలిపారు. ప్రజా రక్షక పోలీస్ వ్యవస్థ.. ప్రజా భక్షక వ్యవస్థగా మారిందని ధ్వజమెత్తారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రైవేట్ కేసులు వేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇంద్రకీలాద్రి, తిరుమలలో అన్యమత ప్రచారం దుర్మార్గంమన్నారు. విమానాల్లో వాడే ఫ్యూయల్ కంటే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉందని విమర్శించారు. ఆరు దశల్లో పరిశీలన పేరుతో పెన్షన్, రేషన్ కార్డులు కోత పెడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళలో 6676 కరోనా కేసులు - దేశంలో 13 వేల పాజిటివ్ కేసులు