Webdunia - Bharat's app for daily news and videos

Install App

షుగ‌ర్ వ్యాధి సామాన్య‌మైన‌ది కాదు... చికిత్స‌కు రాయితీలివ్వాలి!

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (10:18 IST)
సామాజిక అంశాల‌పై త‌న‌దైన శైలిలో స్పందించే సీజే ఎన్వీ ర‌మ‌ణ‌, ఈసారి సుగుర్ వ్యాధిపైనా స్పందించారు. మధుమేహం ఖరీదైన వ్యాధిగా మారింద‌ని, దీని చికిత్స, మందులకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. ఇది ధనికులకు వచ్చే వ్యాధి అన్న అపోహ ప్రజల్లో ఉందని, కానీ వాస్తవంగా ఇది పేదవారి శత్రువు అని అభివర్ణించారు. 
 
 
మధుమేహంపై అహుజా బజాజ్‌ 8వ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ‘‘ఆధునిక జీవనశైలి కారణంగా పుట్టుకొచ్చిన మధుమేహాన్ని డాక్టర్లు, పరిశోధకులు ‘అవకాశవాద మృత్యువు’గా అభివర్ణిస్తున్నారు. ఇది జీవితాంతం వెంటాడే రోగం. దీనికోసం వాడే మందులు, ఇన్సులిన్లు దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలను చూపుతున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ ప్రజలు కూడా దీనిబారిన పడుతున్నారు. అందుబాటు ధరల్లో వైద్యసౌకర్యాలు లేకపోవడం, అవగాహన కొరవడటం వల్ల ఇది ముదిరిపోయే వరకు సమస్యను గుర్తించలేని పరిస్థితి నెలకొంది.
 
 
అందువల్ల ప్రభుత్వాలు మ‌ధుమేహ చికిత్సలకు, మందులకు రాయితీలు ఇవ్వాల‌ని సీజె సూచించారు.  నేను కూడా ఒత్తిడితో కూడిన ఈ న్యాయవృత్తిని కాకుండా మరోదైనా వృత్తిని ఎంచుకొని ఉంటే, దీని చికిత్స కోసం డాక్టర్లను ఒత్తిడి చేసే పని ఉండేది కాదేమోన‌న్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారమంతా పాశ్చాత్య దేశాల పరిశోధనల ఆధారంగా రూపొందించిందేన‌ని, అందువల్ల భారత పరిస్థితులపై దృష్టి సారించి అధ్యయనాలు చేయాల‌న్నారు.


ఇప్పటికీ మనం రక్తంలో గ్లూకోజు స్థాయిని ప్రామాణీకరించలేకపోవడం దురదృష్టకరమ‌ని, ఆధునిక మందులు కనిపెట్టి ఈ రోగాన్ని నివారించేందుకు ప్రయత్నించాల‌న్నారు. గత 30 ఏళ్లుగా తాను ఒకే మందే వాడుతున్నాన‌ని, దీన్ని సంపూర్ణంగా నియంత్రించే విధానం రావాలన్నదే త‌న ఆకాంక్ష అని జస్టిస్‌ రమణ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments