Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ధాన్యం కొనుగోలుపై తెరాస వాయిదా తీర్మానం

Webdunia
సోమవారం, 29 నవంబరు 2021 (10:15 IST)
పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల తొలి రోజునే తెలంగాణ రాష్ట్రంలోని అధికార తెరాస పార్టీ ధాన్యం కొనుగోలుపై చర్చించాలని కోరుతూ వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చింది. ఈ మేరకు తెరాస సభ్యులు ఉభయ సభల్లో నోటీసులు ఇచ్చారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు నెలకొనివున్నాయని అందువల్ల రూల్ 267 కింద తక్షణం ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని రాజ్యసభ ఛైర్మన్‌కు తెరాస ఎంపీ కె.కేశవరావు డిమాండ్ చేశారు. 
 
భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ) నిర్లక్ష్యపూరిత వైఖరి వల్ల తెలంగాణా రాష్ట్రంలో లక్ష టన్నుల ధాన్యం మార్కెట్ యార్డుల్లో మురిగిపోతుందని ఆయన ఆరోపించారు. పైగా, కేంద్రం కూడా పంట సేకరణపై వివక్షాపూరిత వైఖరిని అవలంభిస్తుందన్నారు. అందువల్ల ధాన్యం సేకరణ అంశంపై చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

భయపెట్టబోతున్న అప్సరా రాణి.. రాచరికం - పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో షురూ

సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌ కథతో సుధీర్ బాబు నూతన చిత్రం

నటి గా అవకాశాలు కోసం ఆచితూచి అడుగులేస్తున్న శివానీ రాజశేఖర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments