Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌ను కలుస్తానంటున్న బాలకృష్ణ.. ఎందుకబ్బా?

Webdunia
శుక్రవారం, 8 జనవరి 2021 (13:29 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని సినీ నటుడు, హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఈ ప్రకటన టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపింది. అయితే, ఆయన సీఎం జగన్‌ను కలవడానికి ప్రధాన కారణం లేకపోలేదు. 
 
ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఇదే విషయంపై అవసరం అయితే సీఎంను కలుస్తానని ప్రకటించారు. 
 
ప్రస్తుతం బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, స్థానిక వైకాపా నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. హిందుపురంలో పేకాట, మట్కాను అధికార పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. మాట వినని అధికారులను బదిలీ చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే ఐదుగురు మున్సిపల్ కమిషనర్లను మార్చారని గుర్తుచేశారు. 
 
ఇంటి పట్టాల పంపిణీలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోంద న్నారు. ఆలయాలపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mirai Review: తేజ సజ్జ, మంచు మనోజ్ ల మిరాయ్ చిత్రంతో అనుకుంది సాధించారా.. రివ్యూ

Jabardasth Comedian: వైల్డ్ కార్డ్ ఎంట్రీ- బిగ్‌బాస్ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments