Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తేలనున్న తెదేపా మాజీ మంత్రి గంటా భవితవ్యం

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (07:51 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు భవితవ్యం శుక్రవారం తేలనుంది. ఆయనకు పార్టీ అధినేత నుంచి పిలుపు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఇన్‌ఛార్జులు, పలువురు ఎమ్మెల్యేలకు ఈ కబురు వెళ్లింది. శుక్రవారం జరిగే కీలక భేటీలో మొత్తం 12 మందికి ఆహ్వానం వెళ్లింది. 
 
కబురు పంపిన వారిలో సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు కూడా ఉన్నారు. నిజానికి ఈయన గత 2019 ఎన్నికల తర్వాత పార్టీలో క్రియాశీలకంగా లేరు. ఒకసారి వైకాపాలో మరోమారు బీజేపీలో చేరబోతున్నట్టు ముమ్మరంగా ప్రచారం జరిగింది. అయితే, ఈ ప్రచారాన్ని ఆయన ఏ రోజూ ఖండించకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. 
 
ఆ తర్వాత విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ అది ఆమోదానికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించే సమావేశానికి గంటాతో పాటు 12 మందిని ఆహ్వానించారు. ఈ సమావేశానికి గంటా వస్తారా? లేదా? అన్నది తేలిపోతుంది. ఒకవేళ వస్తే ఆయన టీడీపీలోనే కొనసాగే అవకాశం వుంది. లేనిపక్షంలో ఆయన పార్టీ మారడం ఖాయమని తేలిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments