Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు బెయిల్

ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు బెయిల్
, శనివారం, 12 ఫిబ్రవరి 2022 (11:01 IST)
ప్రభుత్వ సర్వీసులో ఉండగా పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారన్న ఆరోపణలపై ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును సీఐడీ పోలీసులు గురువారం అర్ధరాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అశోక్‌బాబుకు బెయిల్ లభించింది. 
 
2022, ఫిబ్రవరి 11వ తేదీ శుక్రవారం రాత్రి బెయిల్‌పై విడుదలయ్యారు. ఇద్దరి పూచీకత్తు, 40వేల రూపాయల డిపాజిట్‌తో 2వ ఏసీఎంఎం న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ ఇచ్చింది. 14 రోజుల రిమాండ్‌ విధించిన తర్వాత బెయిల్‌ మంజూరు చేసింది. 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఐడీ చరిత్రలో చిన్న నేరంపై ఏడు కేసులు పెట్టారని అన్నారు. సీఐడీ అధికారులు సమ్మెపై విచారించారని…తనపై పెట్టిన కేసు గురించి తక్కువగా మాట్లాడారన్నారు. తనపై కక్షపూరితమైన చర్యలు ఆపాలన్నారు. 
 
ఉద్యోగ సంఘాల సమ్మెలో తన పాత్ర లేదని, వారు కోరితే మద్దతిస్తామని చెప్పామన్నారు. ఉద్యోగులకు నష్టం కలిగిస్తే ప్రభుత్వం కనుమరుగవడం ఖాయమని హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిజాబ్ వ్యవహారంలో వెనక్కి తగ్గని కర్ణాటక... కాలేజీ గేటు వద్దే..?