నేడు పెంచలకోన పుణ్యక్షేత్రానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు...

ఠాగూర్
శుక్రవారం, 22 మార్చి 2024 (07:44 IST)
నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలంలోని పెంచలకోన పుణ్యక్షేత్రానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం రానున్నారు. ఇక్కడ శ్రీలక్ష్మీనరసింహ స్వామి వార్లను దర్శనం చేసుకుంటారు. ఇందుకోసం ఆయన మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హైదరాబాద్ నుంచి నెల్లూరుకు హెలికాఫ్టరులో చేరుకుంటారు. స్వామివారి దర్శనం తర్వాత ఆయన విజయవాడలోని ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. 
 
మరోవైపు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే స్థానాల్లో మరో 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సివుంది. ఇంకోవైపు, లోక్‌సభ ఎన్నికల కోసం 17 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేయాల్సివుంది. ఇందుకోసం ఆయన ముమ్మరంగా కసరత్తులు చేస్తున్నారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 144 స్థానాల్లోనూ, 25 లోక్‌సభ సీట్లలో 17 చోట్ల పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. 
 
అలాగే, పొత్తులో భాగంగా, జనసేన పార్టీకి 2 ఎంపీ సీట్లు, బీజేపీకి 5 లోక్‍‌సభ, అసెంబ్లీ సీట్లలో జనసేనకు 21 అసెంబ్లీ, బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లను కేటాయించిన విషయం తెల్సిందే. ఇదిలావుంటే, విశాఖ స్థానం నుంచి పోటీ చేసేందుకు కూటమి అభ్యర్థులు గట్టి పోటీ పడుతున్నారు. ఈ స్థానంలో టీడీపీ తరవున గీతం భరత్ పోటీ చేయాలని భావిస్తుండగా, బీజేపీ తరపున జీవీఎల్ నరసింహా రావు పోటీ చేసేందుకు సై అంటున్నారు. ఇలాంటి అంశాలను పరిష్కరించిన తర్వాతే మిగిలిన అభ్యర్థుల జాబితాను ఇరు పార్టీలు ప్రకటించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments