Webdunia - Bharat's app for daily news and videos

Install App

కందుకూరు తొక్కిసలాట.. టీడీపీ రూ.24 లక్షల ఎక్స్‌గ్రేషియా

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (22:13 IST)
కందుకూరు తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీడీపీ రూ.24 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బుధవారం రాత్రి కందుకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు చేపట్టిన రోడ్‌షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన ఎనిమిది మంది వ్యక్తుల బంధువులకు ఒక్కొక్కరికి రూ.24 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది టీడీపీ. 
 
మృతుల కుటుంబాలకు తొలుత రూ.10 లక్షలు ప్రకటించిన టీడీపీ.. గురువారం అదే రూ.15 లక్షలకు పెంచింది. మృతుల బంధువులకు 11మంది నేతలు మరో రూ.9 లక్షలు ప్రకటించారు.
 
నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో బుధవారం రాత్రి మాజీ ముఖ్యమంత్రి రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు సహా వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతిపక్ష నేతను చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం ముందుకు వచ్చి కాలువలో పడిపోవడంతో జరిగిన ఈ విషాదంలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో గురువారం టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలను ఓదార్చారు. కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ తరపున ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

Tammareddy: మంచు విష్ణు, మనోజ్ కు మధ్యవర్తిగా తమ్మారెడ్డి భరద్వాజ

తమ్ముడుని కాపాడుకునేందుకు దిల్ రాజు నాపై నిందలు వేశారు... అత్తి

కన్నప్ప నుంచి అరియానా, వివియానా పాడిన శ్రీ కాళ హస్తి పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments