Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 కాదు 30 రాజధానులు పెట్టుకోండి.. జగన్‌పై తమ్మారెడ్డి భరద్వాజ సెటైర్లు

Webdunia
సోమవారం, 24 ఫిబ్రవరి 2020 (14:27 IST)
Tamma Reddy_Jagan
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై డైరక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ సెటైర్లు విసిరారు. రాజధానుల అంశంపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ.. మూడు రాజధానులు కాకపోతే.. 30 పెట్టుకోండంటూ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి ఏపీలో మూడు  రాజధానుల అంశం పెద్ద చర్చకు దారి తీస్తోంది. 
 
జగన్‌కు మూడు రాజధానుల అంశంపై పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. అమరావతిలో గత 50 రోజుల నుంచి రైతులు కూడా ఏకథాటిగా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే.. ఇప్పటివరకూ టాలీవుడ్‌ నుంచి మాత్రం ఏపీ గురించి ఎవరూ ప్రత్యేకంగా మాట్లాడలేదు. అందరూ జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ వచ్చారు. కానీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమైనాయి.
 
ఏపీకి మూడు రాజధానులు కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండని సెటైర్లు వేశారు. ఓ కార్యక్రమంలో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడి నుంచి పాలన జరిగితే అదే రాజధాని అవుతుందన్నారు. మరి కొత్తగా పేరు పెర్లు పెట్టినంత మాత్రాన పాలన ఆగిపోదు కదా అన్నారు. 
 
అలాగే మంచికో, చెడుకో అమరావతి రాజధానంటూ ప్రకటించారు. ఇప్పటికే ఆ ప్రాంతంపై వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మరో రెండు వేల కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది కదా. కానీ ఇప్పుడు మళ్లీ కొత్త రాజధానులంటే ప్రజలకు నష్టం కలిగి అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments